Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూన్ 16, 17 తేదీలలో మండల కేంద్రాల్లో రైతు ధర్నాలు

జూన్ 16, 17 తేదీలలో మండల కేంద్రాల్లో రైతు ధర్నాలు

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట

జూన్ 16,17న మండల కేంద్రాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం రెండో మహాసభలో నూతన ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా తుమ్మల వెంకటరెడ్డి తోపాటు 17 మందితో జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది .నూతనంగా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతుల సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రధానంగా గోదావరి జలాలు ములుగు జిల్లాకు వచ్చేవరకు ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు ,జిల్లాలో ప్రభుత్వ భూములలో పేదలు 40 వేల ఎకరాలలో కాస్తు కబ్జాలో ఉన్నారని వీరందరికీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నకిలీ విత్తనాలతో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు సీజెంటా కంపెనీ ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోవిందరావుపేట మండలంలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు, ములుగు జిల్లాలో 20,093 ఎకరాలు 5కోట్ల72 లక్షలు మంజూరయ్యాయి. వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా 10 ఎకరాల లోపు రైతులందరికీ చేయాలని, రెండు లక్షల పైబడిన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పై సమస్యల సాధనకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో జూన్ 16,17 తేదీలలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

నూతన రైతు జిల్లా కమిటీ సభ్యులుగా తీగల ఆదిరెడ్డి చిట్టెం ఆదినారాయణ ఉపాధ్యక్షులుగా ఎల్పీ ముత్యాలు వడకాపురం సారయ్య సహాయ కార్యదర్శిగా సభ్యులుగా భూక్య రూప్ సింగ్ కొండలరావు గుండు రామస్వామి బండారి నరసింహులు నల్లబోయిన పాపారావు కావేరి నాగయ్య చంద్రశేఖర్ సుధాకర్ కంఠం సత్యం తోట నాగేశ్వరరావు ఓకే నాగేశ్వరరావులను ఎంపిక చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -