- Advertisement -
మండల వ్యవసాయాధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు
యాసాంగి 2025-26 కోసం తేదీ 28/02/2026 లోపు కొత్తగా పట్టాలు పొంది పట్టాదారు పాస్ పుస్తకాలు డిజిటల్ సంతకాలైన రైతులు ఈ నెల 25 లోపు తమ బ్యాంకు అకౌంట్ వివరాలను రైతు భరోసా పోర్టుల్లో న మోదుకై దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బొల్లపల్లి శ్రీజ సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసే రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సూచించిన ఫారం పట్టాదారు పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్,బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్ అందుబాటులో ఉన్న క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులకు అందచేయాలని, అర్హులైన రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
- Advertisement -



