- -కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ : భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ లో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సు లో రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న నూతన భూభారతి రెవెన్యూ చట్టం 2025, రెవెన్యూ గ్రామసభల పై రైతులు ప్రత్యేకంగా అవగాహన పెంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సదస్సులను పక్కాగా వినియోగించుకోవాలన్నారు, అధికారులు పహానీ లతో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యి సమస్యలు పరిష్కార దిశగా రైతులకు అవగాహన పరచడం జరుగుతుందన్నారు. అందుకనుగుణంగా దరఖాస్తులను పూర్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ ద్వారా సహకరిస్తున్నామని అనంతరం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని రైతులకు తెలియజేశారు.భూ భారతి చట్టంలో రైతుల భూముల సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయని రైతులకు తెలియజేశారు. దరఖాస్తు చేయడం కోసం వచ్చే వారికి హెల్ప్ డెస్క్ లు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రైతులకు తెలియజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.