- Advertisement -
నవతపెలంగాణ – హైదరాబాద్: మధ్య అమెరికాలో ఉన్న గ్వాటెమాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది స్పాట్లోనే చనిపోయారు. మరో 20 మంది గాయపడటంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 11 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక మైనర్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



