- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఏడుగురు కార్మికులు మతి చెందారు. ఘటన జరిగిన పని ప్రదేశంలో సుమారు 26మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -