- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలోని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. లూథియానా నుండి దర్భంగాకు వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఈ దుర్ఘటనకు గురైంది. ఈ ప్రమాదంపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



