Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డుప్రమాదం..వరుడు సహా 8 మంది మృతి

ఘోర రోడ్డుప్రమాదం..వరుడు సహా 8 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్‌యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్‌యూవీ కారు జెవానై గ్రామంలో కళాశాల గోడను ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో వెళ్తుండడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. గోడను ఢీకొట్టి బోల్తా పడింది. సంఘటనాస్థలిలోనే వరుడు ప్రాణాలు వదిలాడు. కొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన సమయంలో వరుడు చనిపోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుమకున్నాయి.

సంభాల్‌లోని హర్ గోవింద్‌పూర్ గ్రామం నుంచి పొరుగున ఉన్న బుడాన్ జిల్లాలోని సిర్టౌల్‌లోని వధువు గ్రామానికి వరుడు సూరజ్, కుటుంట సభ్యులు కారులో వెళ్తున్నారు. దాదాపు 10 మంది కుటుంబ సభ్యులు కారులో కూర్చున్నారు. ఉదయం పూట రోడ్లు ఖాళీగా ఉండడంతో కారును డ్రైవర్ అత్యంత వేగంగా పోనిచ్చాడు. హఠాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టాడు. కారు బోల్తా పడడంతో వరుడు సూరజ్(24) అక్కడికక్కడే మరణించాడు. మృతుల్లో వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, గుర్తు తెలియని ఇద్దరు మైనర్లు సహా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలీఘర్‌లోని ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) అనుకృతి శర్మ సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -