- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని ఝుబువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యానును ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
- Advertisement -