- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది. కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
- Advertisement -



