- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని బాలిలో చైనా పర్యాటకులతో వెళుతున్న మినీ బస్సు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రహదారి నుండి పక్కనే ఉన్న తోటలోకి దూసుకువెళ్లి చెట్టును ఢీకొందని అన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
- Advertisement -



