Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీజుల దోపిడీని అరికట్టాలి..

ఫీజుల దోపిడీని అరికట్టాలి..

- Advertisement -

అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఉన్న కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి,అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు. సోమవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పిడిఎస్యు) అధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్ల అనేక బ్రాంచీల పేరిట పుట్టుకొస్తున్నాయని అన్నారు. ఈ- టెక్నో, ఐఐటి,ఒలింపియాడ్ లాంటి తదితర పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్ధుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని అన్నారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, టై, షూ పాఠశాలలోనే అమ్ముతూ మరో విధంగా దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎలాంటి రక్షణ లేనటువంటి భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తూ విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.పాఠశాలల్లో ఆట స్థలాలు లేకపోవడం వల్ల విద్యార్ధులకు మానసిక వికాసం దెబ్బతింటుందని అన్నారు.వీటిపై ఎన్ని సార్లు జిల్లా విద్యాశాఖాధికారి గారికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.వెంటనే కలెక్టర్ గారు స్పందించి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ విద్యాసంస్థల పై చర్యలు తీసుకొని యెడల పిడిఎస్యు అధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు భీమనపల్లి ప్రకాష్, ఐతరాజు నవీన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -