- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం సాయి బాబా కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. కోటపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, దారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్గా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య (28) తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా వేధించారా..?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



