Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపండుగకు పస్తులేనా.?

పండుగకు పస్తులేనా.?

- Advertisement -

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కరువు

మూడు నెలలుగా తప్పని ఎదురుచూపులు

భారంగా మారిన కుటుంబ పోషణ

నవతెలంగాణమల్హర్ రావు.

నెలల తరబడి వేతనాలు అందక..అప్పులు చేయలేక…పస్తులు ఉండలేక…దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మండలంలోని పారిశుద్ధ్య కార్మికులు. పండుగ రోజుల్లోనూ కుటుంబంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. పల్లెలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు రాక ఇక్కట్లకు గురవుతున్నారు. అసలే చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, సమయానికి జీతం రాక మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

15 జీపీలు..70 మంది కార్మికులు..

మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీ లు ఉండగా, 22,446 వేల ఓటర్లు,25,790 మంది జనాభా ఉన్నారు. కాగా గత ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ కోసం గ్రామానికో ట్రాక్టర్ ను కేటాయించింది. గ్రామాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామానికి 3 నుంచి 10 మంది చొప్పున మొత్తం 70 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 9,500 చొప్పున వేతనాలు చెల్లించింది. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మెజార్టీ గ్రామాల్లో కార్మికులకు గత మూడు మాసాలుగా వేతనాలు రావటం లేదు. దీంతో బతుకమ్మ, దసరా పండుగకు కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిన చెత్త సేకరణ

గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి సుమారు రెండు సంవత్సరాలు కావొస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపో యాయి. చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లలో కొంతకాలం పాటు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి డీజిల్ పోయించారు. తలకు మించిన అప్పులు కావడంతో ఇక మాతో చెత్త సేకరణ కాదని చేతులెత్తేశారు.దీంతో మండలంలోని గ్రామాల్లో చెత్త సేకరణ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త సేకరణ నిలిచిపోవటంతో పల్లెల్లో వ్యాధులు ముసురుతున్నాయి.ఇప్పటివరకు మండలంలో 2 డెంగీ కేసులు నమోదు కాగా, టైఫాయిడ్ 76, డయేరియా 5 కేసులు నమో దయ్యాయి. 526 మంది విషజ్వరాల బారినపడ్డారు.

ఇబ్బంది పడుతున్నాం..

సాదుల శ్రీకాంత్..

తెలంగాణ జీపీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

మాకు మూడు నెలల నుంచి జీతం రావడం లేదు. దసరా పండు గకు కుటుంబ సభ్యులకు కనీసం బట్టలు కొనలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధి కారులు జీతాలు ఇప్పించి ఆదుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -