- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాంలోని జోర్హాట్ నుంచి శిక్షణలో భాగంగా గురువారం సాయంత్రం బయలుదేరిన సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కర్బీ ఆంగ్లోంగ్ జిల్లా సమీపంలో కూలిపోయింది. భారత వైమానిక దళం (IAF) ఈ విషయాన్ని ధృవీకరించింది. విమాన శకలాలను గుర్తించిన అధికారులు, విమానంలోని ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వైమానిక దళం దర్యాప్తుకు ఆదేశించింది.
- Advertisement -



