‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’ అనే ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్తో మేకర్లు రాబోతోన్నారు. కష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ ఈనెల 27న జీ5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో నవీన్ చంద్ర ట్రైలర్ను రిలీజ్ చేసి, సిరీస్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ,’దివ్య చెప్పిన నెరేషన్ విన్న తరువాత నన్ను ఈ కథ చాలా వెంటాడింది. అభిజ్ఞ సైతం ఈ కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యారు. కష్ణ కూడా ముందు ఈ ప్రాజెక్ట్లో లేరు. కానీ నా మాట కోసం కష్ణ వచ్చి డైరెక్షన్ చేశారు. నా ఫ్రెండ్ ప్రవీణ్ ఈ ప్రాజెక్ట్ కోసం అన్నీ తానై పని చేశారు. 80వ వాతావరణాన్ని చూపేందుకు ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర, క్యాస్టూడ్ డిజైనర్ అంజలి చాలా కష్టపడ్డారు’ అని తెలిపారు. ‘జీ5లో ‘రెక్కీ’ తరువాత ఈ వెబ్ సిరీస్ చేశాను. ‘రెక్కీ’లానే ఈ ప్రాజెక్ట్ని కూడా ప్రేక్షకులు ఎంజారు చేస్తారు’ అని డైరెక్టర్ కష్ణ పోలూరు చెప్పారు.హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ,’మూఢ నమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు, కథలు చాలా అరుదుగా వస్తుంటాయి’ అని అన్నారు.