సుమారు రూ.3 లక్షల నష్టం..
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోని పెద్దవూర శివారులోని ఉన్న బత్తాయి తోటలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాధిత రైతు కోట అంజియ్య తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు మధ్యాహన్నాం 2 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఎకరం దొండ తోటకు మంట అంటుకుంది. పక్కన వున్న రైతులు బాధితుడు కోట అంజయ్యకు సమాచారం తెలియజేశారు. అయితే రైతు తోటకు వచ్చే సమయానికి దొండ పందిరి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. మరోవైపు పక్కనే వున్న రైతు తోటలో నుంచి పైపులతో నీళ్లు కొట్టి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. అయినా డ్రిప్ పైపులు, పదిఫీట్ల పందిరి స్థంబాలు ,పైపులైన్లు, విద్యుత్ వైర్లు, పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం వలన సుమారు రూ 3.లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. దగ్ధమైన దొండ పందిరి చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాకు నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితుడు కోరారు.
అగ్నికి ఆహుతైన దొండ తోట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES