- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పూరీ – తిరుపతి రైలులో మంటలు చెలరేగాయి. తుని – అన్నవరం మధ్య గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకోవడం ప్రమాదానికి దారితీసింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కాగా.. రైలులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే సిబ్బంది తెలిపారు.
- Advertisement -



