- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేసముద్రం రైల్వేస్టేషన్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. స్టేషన్లోని నిలిపివేసిన ఓ రెస్ట్ కోచ్ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కోచ్లో నలుగురు ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు చాకచక్యంగా స్పందించి వెంటనే కంపార్ట్మెంట్ తలుపులు తెరిచి ప్రాణాలతో బయటపడ్డారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టెషన్కు చేరుకుని రెస్ట్ కోచ్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
- Advertisement -