- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని కటక్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది రోగులు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
- Advertisement -



