- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : లండన్లో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు యువకుడు మృతిచెందాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలోని కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్ (28) మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఎంబీఏ చేసేందుకు మూడేళ్ల క్రితం లండన్ వెళ్లిన అభిషేక్.. చదువు అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం స్వస్థలానికి వచ్చి తిరిగి వెళ్లాడు. అభిషేక్ తండ్రి ఆస్కారరావు ఆగిరిపల్లి పీహెచ్సీలో సీహెచ్వోగా పనిచేస్తున్నారు.
- Advertisement -



