– కేంద్ర మంత్రి నుంచి అవార్డు స్వీకరించిన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పాస్పోర్ట్ల వెరిఫికేషన్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా నుంచి రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్రెడ్డి మంగళవారం అవార్డును స్వీకరించారు. ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన పాస్పోర్ట్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును బహూకరించారు. 2024-25కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 8,06,664 పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలోని పాస్పోర్ట్ వెరిఫికేషన్ యూనిట్ సకాలంలో పూర్తి చేసినందుకు ఈ అవార్డు లభించింది. ఇందులో వెరిఫికేషన్ సందర్భంగా సంఘవిద్రోహ శక్తులు, ఆర్థిక నేరస్థులు, ఇతర క్రిమినల్ కేసులలో సంబంధాలున్నవారి దరఖాస్తులను ఏరివేసి, నిజమైన దరఖాస్తుదారులకు సత్వరంగా పాస్పోర్ట్ వచ్చేలా రాష్ట్ర నిఘా విభాగం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని కేంద్ర మంత్రి పవిత్ర మార్గెరిటా ఈ సందర్భంగా అభినందించారు. పాస్పోర్ట్ల వెరిఫికేషన్లో 2014-2025 వరకు ఆరుసార్లు దేశంలోనే అగ్రస్థానాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నిలుపుకున్నదని ఆమె ప్రశంసించారు. ముఖ్యంగా, ఒక పాస్పోర్ట్ వెరిఫికేషన్కు 15 రోజుల గడువు ఉండగా.. అందులో ఏడు రోజుల్లోనే వెరిఫికేషన్ను పూర్తి చేయటం విశేషమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా శివధర్రెడ్డి మాట్లాడుతూ.. తమ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాల అధికారులు, సిబ్బంది జరిపిన కృషి కారణంగానే ఈ అవార్డు లభించిందని అన్నారు. ముఖ్యంగా, పాస్పోర్ట్ వెరిఫికేషన్లకు సంబంధించి రూపొందించిన వెరీ ఫాస్ట్ యాప్ను సక్రమంగా అమలు చేయటం వలన ఈ ఫలితం లభించిందని తెలిపారు.
పాస్పోర్ట్ల వెరిఫికేషన్లో ఫస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES