- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఏపీ నుంచి అంతర్జాతీయంగా ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు శుభవార్తను అందించాయి. విశాఖపట్నం నుండి అబుదాబీకి అంతర్జాతీయ విమాన సర్వీసులు జూన్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసు వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 9.50 గంటలకు అబుదాబీకి బయలుదేరుతుందని వెల్లడించారు.
- Advertisement -