Wednesday, June 4, 2025
E-PAPER
Homeజాతీయంఅరుణాచ‌ల్‌లో వ‌ర‌ద‌లు..రంగంలోకి దిగిన ఎయిర్‌ఫోర్స్

అరుణాచ‌ల్‌లో వ‌ర‌ద‌లు..రంగంలోకి దిగిన ఎయిర్‌ఫోర్స్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈశాన్య రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వ‌ర‌ద‌లు పోటెత్తాయి. దీంతో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆ రాష్ట్రంలోని బోజీర్ న‌దిలోకి భారీస్తాయిలో వ‌ర‌ద నీరు చేర‌డంతో ఉధృతంగా ప్ర‌వాహిస్తుంది. దీంతో మైదాన ప్రాంతాల‌కు కొండ ప్రాంతాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌లువురు ప్ర‌జ‌లు వ‌ర‌దలో చిక్కుకుపోయారు. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర సాయాన్ని కోరింది. దీంతో యుద్ద ప్రాతిప‌దిక‌న ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ద‌ళం రంగంలోకి దిగింది. ఆ రాష్ట్ర విప‌త్తు ద‌ళం, ఎయిర్ ఫోర్స్ సేన‌లు క‌లిసి బాధితుల‌ను కాపాడానికి సోమ‌వారం తెల్ల‌వారుజామును సంయుక్త ఆప‌రేష‌న్స్ చేప‌ట్టాయి. 14 మంది వ‌ర‌ద బాధితుల‌ను రెస్క్యూ టీం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది.నిన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు సెప్పా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఏడుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞప్తి మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ఉద‌యానే వ‌ర‌ద బాధితుల ర‌క్ష‌ణ కోసం రాష్ట్ర విప‌త్తు ద‌ళంతో సంయుక్త ఆప‌రేష‌న్ చేప‌ట్టామ‌ని డిఫెన్స్ పిఆర్ఓ గౌహతి పేర్కొన్నారు.తీవ్రమైన వరదల కారణంగా ప్రధాన భూభాగం నుండి తెగిపోయిన వారిని IAF Mi-17 హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా తరలించామ‌న్నారు.

మణిపూర్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు ప్రజల చుక్కలు చూపించాయి. వేసవి సమయంలో కురిసిన ఈ ఆకల వర్షలతో మణిపూర్‌ తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన‌ ఆర్మీ సేన‌లు..లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. నీట మునిగిన ప‌లు ప్రాంతాల్లో ప‌డ‌వల‌ సాయంతో వ‌ర‌ద బాధితుల‌ను త‌ర‌లిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -