- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్లోని జోధ్పూర్లో రూ.1,285 కోట్లతో నిర్మించిన రింగ్ రోడ్డు ప్రారంభానికి ముందే పలు చోట్ల కూలిపోయింది. ముఖ్యంగా ఫ్లైఓవర్ స్లాబ్లు దెబ్బతినడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్లు దీనికి బాధ్యత వహించాలని, మరీ ఇంత నిర్లక్ష్యంగా నిర్మిస్తారా? అంటూ మండిపడుతున్నారు
- Advertisement -