- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎర్రగడ్డలోని మానసిక చికిత్సా కేంద్రంలో ఆహార కల్తీ కారణంగా 70 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కిరణ్ అనే మానసిక రోగి మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 67 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ ఆరా తీశారు. రోగులకు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం రాత్రి మానసిక వైద్యశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
- Advertisement -