– టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని టూరిజం హోటల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా కలియతిరుగుతూ ఆహార పదార్థాలను, కిచెన్ను పరిశీలించారు. అల్పాహారం చేస్తున్న పర్యాటకులు, అతిధులతో మంత్రి మాట్లాడారు. ఆహార నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరిత హౌటళ్లలో సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హౌటళ్ల నిర్వాహకులపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, అతిధుల కోసం మెరుగైన వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నామని చెప్పారు.
ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES