Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంవిదేశాంగ విధానం గందరగోళం

విదేశాంగ విధానం గందరగోళం

- Advertisement -

– ఐరాస తీర్మానంపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ:
గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు భారత్‌ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. భారత విదేశాంగ విధానం అస్తవ్యస్థంగా, గందరగోళంగా ఉన్నదని విమర్శించింది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం కాల్పుల విరమణ పాటించి చర్చలు జరపాలంటూ ఇప్పటి వరకూ ప్రవచనాలు పలికిన కేంద్రం ఆ వైఖరిని విడనాడిందా అని ప్రశ్నించింది. ఓటింగ్‌కు గైర్హాజరు కావాలన్న నిర్ణయంతో భారత్‌ ఒంటరి అయిందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. విదేశాంగ మంత్రి జయశంకర్‌ పదే పదే చేస్తున్న తప్పులను ప్రధాని నరేంద్ర మోడీ సరిదిద్దాలని, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాలని ఖర్గే సూచించారు. ‘గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐరాస ఆమోదించిన తీర్మానానికి 149 దేశాలు మద్దతు తెలిపాయి. 19 దేశాలు మాత్రమే ఓటింగుకు గైర్హాజరు కాగా వాటిలో భారత్‌ కూడా ఉంది. ఈ చర్యతో మనం ఒంటరిగా మిగిలి పోయాం’ అని ఖర్గే చెప్పారు. ఇజ్రా యిల్‌ ప్రజలపై హమాస్‌ జరుపు తున్న దాడులను కూడా కాంగ్రెస్‌ ఖండిస్తోందని ఆయన గుర్తు చేశారు. అలీన సిద్ధాంతానికి, నైతిక దౌత్యానికి కట్టుబడి ఉండడం భారత్‌ దీర్ఘకాలిక వైఖరి అని తెలిపారు. కాగా దక్షిణా సియా, బ్రిక్స్‌, ఎస్‌సీఓలో ఐరాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఏకైక దేశం మనదేనని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ‘నెహ్రూ వారసత్వంపై వారికి గౌరవం ఎలాగూ లేదు. కానీ పాలస్తీనాపై వాజ్‌పేయి అవలంబిం చిన వైఖరికి ఎందుకు దూరంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. ఐరాస తీర్మానంపై ఓటింగుకు భారత్‌ గైర్హాజరు కావడం సిగ్గుచేటు, విచారకరమని ప్రియాంక గాంధీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -