నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రత్యేక విద్య ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించింది. రాష్ట్ర అధ్యక్షులుగా జంగం సుమన్, ప్రధాన కార్యదర్శిగా జి శివరాజ్, కోశాధికారిగా మారుపాక భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎం కపిల్రెడ్డి, శ్రీకాంతాచారి, రహీం, ఉపాధ్యక్షులుగా సిలివేరి వెంకటేశం, జ్యోతి, జాయింట్ సెక్రెటరీలుగా మార్పాటి శ్రీధర్రెడ్డి, వల్లెపు వీరన్న, షోయబ్తోపాటు టెక్నికల్ అడ్వైజర్, మహిళా కార్యదర్శులు, పీఆర్వోలు, వికలాంగుల విభాగం కార్యదర్శులను ఎన్నుకున్నారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్రెడ్డి, అసోసియేట్ సభ్యులు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక విద్య ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES