- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా(84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఐసీసీ ఛైర్మన్ జైషా సంతాపం వ్యక్తం చేశారు. బింద్రా 1993-96 మధ్య బీసీసీఐ ప్రెసిడెంట్గా, 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1987, 1996 వరల్డ్ కప్ భారత్లో జరగడంలో, టీవీ హక్కుల ద్వారా బీసీసీఐకి ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
- Advertisement -



