- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై బాధిత రైతులను కలిసేందుకు వెళ్లడాన్ని అడ్డుకున్నారు. ఈ మేరకు హరీశ్ రావు నివాసం వద్ద భారీ పోలీస్ బలగాలు మోహరించారు. అలాగే మాజీ మంత్రి సబితతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా గృహ నిర్బంధం చేశారు. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను వినేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు.
- Advertisement -



