- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేశారు. ఆ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తాను వచ్చిన అధికారిక కారును కొత్త సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలివెళ్లినట్టు జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీవిరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, సీజేఐకి ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జస్టిస్ గవాయ్ కారును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలివెళ్లినట్టు తెలుస్తోంది.
- Advertisement -



