- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ (78) ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డీహైడ్రేషన్తో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఆయన ముంబైలో సర్వికల్ ఆర్థరైటిస్కు సర్జరీ చేయించుకున్నారు.
- Advertisement -