- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : ఆదివారం మండల కేంద్రంలో మొహరం పండుగలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులామతాలకు అతీతంగా జరుపుకోనేదే మొహరం పండుగ అన్నారు. ఈ పండగ త్యాగానికి ప్రతీక అని ఆయన తెలిపారు. ఈ పండుగ హిందూ ముస్లింలు ఏకతాటిపై ఉంటూ.. గొప్పగా జరుపుకోవడం మంచి పరిణామమని అన్నారు.
ఈ కార్యక్రమం లో జుక్కల్ బీఆర్ఎస్ నాయకులు, జుక్కల్ మాజీ ఎంపీపీ నీలు పటేల్, మాజీ సర్పంచ్ బొల్లి గంగన్న, మాజీ ఉపసర్పంచ్ భాను గౌడ్ , వాశ్రే రమేష్ పటేల్, తాటి బుమన్న, కిరణ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -