నవతెలంగాణ – జుక్కల్: మండల పరిధిలోని పడంపల్లి గ్రామ యువకుడు బాలరాజ్ రోడ్డు ప్రమాదంలో మంగళవారం చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మృతుడు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలరాజు కుటుంబనికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. మృతుని తండ్రి సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు విట్టల్ గా మాజీ ఎమ్మెల్యే హనుమన్ షిండే కు ముఖ్య అనుచరుడుగా ఉంటూ పుట్టినాడు పార్టీకి అండగా ఉంటూ సేవలు చేస్తున్నాడు తన కార్యకర్త కుమారుడు మరణించిన సంఘటన మాజీ ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్ళగానే రోదనలు మిన్నంటి పోయాయి. ఒక్కసారిగా మృతుని భార్య మానస మాజీ ఎమ్మెల్యేని ప్రాధేయపడేయడంతో వారితో వచ్చిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే వెంటా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు నీళ్లు పటేల్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, యువ నాయకుడు వాస్రే రమేష్ , లాడేగావ్ మాజీ సర్పంచ్ భర్త రాజశేఖర్ పటేల్ , నాయకులు విట్టు పటేల్, మడంపల్లి గ్రామానికి చెందిన పావుడే గంగాధర్ , బీఆర్ఎస్ పడంపల్లి గ్రామ అధ్యక్షులు పావుడే బస్వంత్ ( శ్రీను ) , జుక్కల్ నాయకుడు అరుణ్ , తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES