- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతతో మృతి చెందారు. పోలవరం పరిధిలోని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని వైద్యులు నిర్ధారించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రత్నాబాయి, 1972లో ఎమ్మెల్యేగా, 2007లో జీసీసీ చైర్మన్గా, 2009లో రాజ్యసభ సభ్యురాలిగా, 2014లో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆమె మృతితో కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
- Advertisement -



