- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన ఆకుల ఓదెలు (63) అనే రైతు తన చెనువద్ద కూరగాయలు కొస్తున్న నేపథ్యంలో చెనులో ఉన్న విద్యుత్ తీగ తగిలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందాడు.అలాగే మల్లారం గ్రామానికి కలువల నాగరాజు (23) అనే యువ రైతు గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి మోటార్ తీస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు శుక్రవారం మృతుల కుటుంబాలను పరమార్షించారు.అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఆయన వెంటా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -