నవతెలంగాణ-హైదరాబాద్: అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీకి కోర్టు బుధవారం 20 నెలల జైలు శిక్ష విధించింది. వ్యాపార ప్రయోజనాల కోసం యూనిఫికేషన్ చర్చి నుండి లంచాలు తీసుకున్నందుకు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పునిచ్చింది. గతేడాది మాజీ అధ్యక్షుడు యూన్సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినందుకు, కుంభకోణాలకు పాల్పడిన కేసుల్లో మరో మూడు వారాల్లో తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. స్టాక్ ధరల తారుమారు మరియు రాజకీయనిధుల చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు యున్ సుక్ యోల్ భార్య కిమ్కి కోర్టు ఈ శిక్ష విధించింది.
రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ కొరియా యునిఫికేషన్ చర్చి నుండి లగ్జరీ చానెల్ బ్యాగ్లు మరియు డైమండ్ నెక్లెస్ను స్వీకరించడం వంటి ఆరోపణలపై ఆమెకు న్యాయవాదులు 15 ఏళ్ల జైలుశిక్ష, 2.9బిలియన్ల జరిమానా (2మిలియన్ డాలర్లు) విధించాలని డిమాండ్ చేశారు. స్టాక్ ధరలను మార్చడం, రాజకీయ నిధుల చట్టాలను ఉల్లంఘించిన కేసుల్లో కిమ్ను దోషిగా నిర్థారించడానికి తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.



