- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సంస్థ యందు చదువుకున్న పూర్వ విద్యార్థి సాయికుమార్ తన వంతు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. 2025లో నా బి.టెక్ పూర్తిచేసుకుని తపస్వి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ యొక్క నిరంతర మార్గదర్శకత్వం, మద్దతుతో, దుబాయ్లోని ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు తపస్వి వ్యవస్థాపకురాలు శ్రీమతి పద్మావతి , అధ్యక్షురాలు శ్రీమతి ఎస్. సుశీల , ప్రధాన కార్యదర్శి శ్రీ కె. దిలీప్ కుమార్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. తపస్వి సంస్థలో సభ్యుడిగా మారి, ఆ సంస్థ సేవా భావం సాధికారత లక్ష్యాల సాధనలో నా వంతు పాత్రను నిర్వర్తించడానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
- Advertisement -