Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంపెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్

పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, రాజస్థాన్ మాజీ శాసనసభ్యుడిగా తనకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దేశంలోని రెండో అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన అప్లికేషన్‌ను రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్ పరిశీలనకు స్వీకరించింది. ఈ విషయాన్ని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని ధ్రువీకరించారు. ధన్‌ఖడ్ నుంచి దరఖాస్తు అందిందని, నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని ఆయన తెలిపారు. లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయనకు పెన్షన్ మంజూరు అవుతుందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -