- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం హైకోర్టులో జరిగింది. జస్టిస్ గౌస్ మీరా మొహినుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్లతో సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -