- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగు రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఆట.. ఐదో రోజుకు వెళ్లింది. 121 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. విజయానికి మరో 58 పరుగుల దూరంలో ఉంది. జోమెల్ బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి ఫిలిప్కు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (8) వెనుదిరిగాడు. రాహుల్ (25*), సాయి సుదర్శన్ (30) క్రీజులో ఉన్నారు.
- Advertisement -