- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామంలో శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఎముకల బలపరీక్ష శిబిరం నిర్వహించారు.డాక్టర్లు ఉదయ్ కుమార్,శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలారి నాగమణి,ఉపసర్పంచ్ ప్రణయ్ రెడ్డి,వార్డు సభ్యులు శ్రీనివాస్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



