కాంగ్రెస్ పార్టీ.. మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవ తెలంగాణ – మల్హర్ రావు.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళే సందర్శకుల కోసం సోమవారం మండలంలోని అన్ని గ్రామాలకు ఏర్పాటు చేసిన 15 ఉచిత బస్సులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భక్తులు క్షేమంగా వెళ్లి, సురక్షితంగా రావాలన్నారు.ఏ గ్రామానికి కేటాయించిన బస్సులో ఆ గ్రామం ప్రజలు మాత్రమే రావాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పంపించిన తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.కాళేశ్వరం వెళ్లే భక్తులకు కొయ్యుర్ లో మండల మాజీ జెడ్పిటిసి అయితే కోమల-రాజిరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి తోపాటు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,మహిళ నాయకురాళ్ళు పాల్గొన్నారు.