- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ ( HPV) టీకాను దేశవ్యాప్తంగా ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 14ఏళ్ల వయస్సున్న బాలికలకు హెచ్పీవీ టీకా అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది బాలికల ప్రాణాలను కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రహిత భారతాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -



