Tuesday, June 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌కు మ‌ద్ద‌తుగా జీ7 దేశాలు

ఇజ్రాయిల్‌కు మ‌ద్ద‌తుగా జీ7 దేశాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేప‌థ్యంలో..జీ7 స‌భ్య‌దేశాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ఇజ్రాయిల్ దేశానికి మ‌ద్ద‌తుగా ఆ కూట‌మి దేశాలు నిలిచాయి. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జీ7 నాయకులు ఇజ్రాయెల్‌కు స్వీయ రక్షణ హక్కు ఉందని, మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని జీ 7 దేశాలు తెలిపాయి. జూన్ 13 నుంచి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌ను “ప్రాంతీయ అస్థిరత ఉగ్రవాదానికి మూలం”గా జీ7 దేశాలు ఆరోపించాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్‌పై జీ7 దేశాల సంయుక్త ప్రకటన చేశాయి. ఇరాన్‌ దాడులను విరమించుకోవాలని ప్రకటించాయి. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని జీ-7 దేశాలు ముక్తకంఠంతో తెలిపాయి. అలాగే యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడనుందని, అంతా అప్రమత్తంగా ఉండాలని జీ-7 దేశాల సూచించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -