నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యపై వచ్చిన చదువుకోవాలి బాలల చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ప్రత్యేక అవార్డు వరించింది. శనివారం హైదరాబాద్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మెన్ దిల్రాజు, ఎండీ హరీశ్ చేతుల మీదుగా చదువుకోవాలి చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత, అతిథి జాతీయ మాసపత్రిక ఎడిటర్ ఎం వెంకటేశ్వరరావు అందుకున్నారు. చదువుకోవాలి చిత్రాన్ని గుర్తించి ప్రత్యేక అవార్డును ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యపై వచ్చిన ఈ చిత్రానికి అవార్డు ఇవ్వడం ఇచ్చి ప్రోత్సహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. విద్యపై వచ్చిన చదువుకోవాలి సినిమా సందేశాత్మకం చిత్రమని తెలిపారు.
చదువుకోవాలి సినిమాకు గద్దర్ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES