సంగీత్ శోభన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్, పథ్వీరాజ్ బన్న, సాయిశ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి కీలక పాత్రలు పోషిస్తు న్నారు. రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్కుమార్ బందావనం ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేఎస్కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కుమార్ బందావనం మాట్లాడుతూ ‘గతంలో మా సంస్థలో రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్తో తాజాగా ‘గ్యాంబ్లర్స్’ చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్, క్లాస్ ఎంటర్ టైనర్గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది’ అని అన్నారు.
‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్రమిది. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్లతో చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం. ఈ సినిమాలో డిఫరెంట్ సంగీత్ శోభన్ను చూడబోతున్నారు. ఇందులో ఆయన నటన అత్యద్భుతంగా ఉంటుంది’ అని మరో నిర్మాత సునీత చెప్పారు.
భిన్న కాన్సెప్ట్తో ‘గ్యాంబ్లర్స్’
- Advertisement -
- Advertisement -