- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకుంది. రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య గ్యాప్ ప్రస్తుతం 25 రోజులు ఉండగా దాన్ని 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇక పట్టణాలు, నగరాల్లో 25 రోజుల నిబంధననే కొనసాగనుంది. కాగా పశ్ఛిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.
- Advertisement -



