నవతెలంగాణ-హైదరాబాద్ : నకిరేకల్ పట్టణంలోని మూసి రోడ్ లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం దగ్గర ఆదివారం ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే కాడింగ్ కొండయ్య మూసి రోడ్డులో నివాసం ఉంటున్నాడు. రోజువారి కూలి పని చేసుకొని జీవిస్తూ ఉంటున్నాడు. పనులకు వెళ్ళేందుకు రోజువారీగా ఉదయాన్నే వంట చేసుకుందామని గ్యాస్ ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. గ్యాస్ పొగతో మొత్తం పూర్తిగా ఇల్లు నిండిపోయింది. బాధితుడు చుట్టుపక్క ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా ఒక్కసారిగా గుంపు గుడారు.
అప్రమత్తమైన బాధితుడు నేరుగా బయటికి వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి నేరుగా వెళ్లి సమాచారాన్ని అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది పోలీస్ శాఖ నిర్లక్ష్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఎగిసిపడుతున్న మంటలను, పొగను ఫైర్ ఇంజన్ తో చాకచక్యంగా అదుపు చేశారు. మంటలను పొగను అదుపు చేశారు. లీకైన సిలిండర్ను బయటికి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలంతా అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ టి.సాయి దీపక్ సిబ్బంది జయరాజు లింగస్వామి, రాములు, శాంతి కుమార్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో గ్యాస్ లీక్..చెలరేగిన మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES