Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపేలిన గ్యాస్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

పేలిన గ్యాస్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, ట్రక్కు ఢీ కొన్నాయి. దీంతో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆదివారానికి మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గాయాలపాలైన మరో పదిహేను మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోషియార్‌పూర్ జిల్లాలోని మండియాలాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందిస్తూ.. ప్రమాద సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించామన్నారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు మరియు పంజాబ్ పోలీసులు చేరుకుని బాధితులకు సాయం అందించారు. గాయపడిన వారిని అంబులెన్స్ లలో సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad